రాయదుర్గం: ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు వాఖ్యలపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆగ్రహం
గుమ్మగట్ట బేలోడులో జరిగిన కార్యక్రమంలో 1000 ఓట్లు రాని వారు ప్రశ్నిస్తున్నారని, వారికి బడిత పూజ జరపాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేసిన వాఖ్యలపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ అది ప్రత్యక్షంగా నాపైన దాడికి ప్రేరేపించడమే అని అభిప్రాయ పడ్డారు. నా ప్రశ్నలకు సమాధానం లేకనే మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారు. కావాలంటే నేనే మీ ఇంటికి వచ్చి నిలబడతా. మీ చేతులతోనే బడిత పూజ చేయండి. కానీ ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చురకలంటించారు.