రాయదుర్గం: గలగల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే లు
గుమ్మగట్ట మండలంలోని గలగల గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రాయదుర్గం, గుంతకల్లు ఎమ్మెల్యే లు కాలవశ్రీనివాసులు, గుమ్మనురు జయరాం పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం ఆ గ్రామంలో ముందుగా గోకులం షెడ్ ను ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు ను ప్రారంభించారు. టిడిపి మండల కన్వీనర్ కాలువసన్నన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, వైస్ చైర్మన్ దానవేంద్ర పాల్గొన్నారు.