కనిగిరి: ఏ కొత్తపల్లిలో విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్ర భవనాలను ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
చంద్రశేఖరపురం మండలంలోని ఏ కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రం, స్వర్ణ గ్రామ భవనాలను కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రం, స్వర్ణ గ్రామ భవనాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను అందిస్తుంది అన్నారు. కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు