గిద్దలూరు: మాజీ సీఎం వైఎస్ జగనన్న ఏమి చెబితే అదే చేస్తాం: గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి
ప్రజల కోసం పాటుపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఏమి చెప్తే అది చేస్తామని గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలు పట్టణంలోని ఏబీఎన్ కార్యాలయం ఎదుటగా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగనన్నను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కార్యకర్తలను పెంచపరుస్తూ మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని ఇకమీదట రాధాకృష్ణకు మర్యాద ఇవ్వవలసిన అవసరం లేదని కుందూరు అన్నారు