రాయదుర్గం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి
రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఏపిఐఐసి మాజీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గాల ఇన్చార్జ్ లతో జరిగిన సమావేశంలో మెట్టుగోవిందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జగన్ ను కలసి నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. అధికార పార్టీ అనుసరిస్తున్న దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ సూచించినట్లు మెట్టు గోవిందరెడ్డి క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.