గిద్దలూరు: గిద్దలూరు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
మార్కాపురం జిల్లా గిద్దలూరు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో సోమవారం అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రజలకు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలు నేటితో ముగిశాయని చంద్రశేఖర్ అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ఎవరు ఆందోళన చెందకుండా ఎలా అగ్నిప్రమాదాలు నివారించాలో చంద్రశేఖర్ వివరించి చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.