మార్కాపురం పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపం ఎదురు పాత రంగ నాయకులు హాస్పిటల్ సందులో ఆకతాయిలు టైర్లు కాల్చిన సంఘటన జరిగింది. ఈ సందులో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఈ విషయాన్ని పలుసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. టైర్లు కాలి భారీగా మంటలు వ్యాపించడంతో.స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి ఫోన్ చెయ్యడంతో ఫైర్ బండి వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.