కళ్యాణదుర్గం: పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కుందుర్పిలో ఎంఈఓ లు లక్ష్మీదేవి, తిప్పేస్వామి
పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కుందుర్పి మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి తల్లిదండ్రులను కోరారు. కుందుర్పిలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లారు. ఐదు సంవత్సరాల్లో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలను తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.