రాయదుర్గం: గతంలో వైసిపి లో ఉన్నాననే కక్షతో దాడులు, అక్రమ కేసులతో టిడిపి వారు వేధిస్తున్నారు : బిజెపి కార్యకర్త బోరువెల్ నాగిరెడ్డి
కూటమిలో ఉన్నా గతంలో YCP లో ఉన్నామనే కక్షతో TDP నేతలు దాడులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారని BJP కార్యకర్త బోరువెల్ నాగిరెడ్డి ఆరోపించారు. బళ్లారిలో చికిత్స పొందుతూ ప్రకటన విడుదల చేశారు. TDP నేత సుభాన్ అనుచరులు ఫోన్ చేసి పిలిపించి వేటకొడవళ్లతో దాడి చేశారన్నారు. తానే హత్యాయత్నం చేసినట్లు తప్పుడు కేసు పెట్టారని, రాయదుర్గం ఆసుపత్రిలో చికిత్స అడ్డుకున్నారని ఆరోపించారు. కూటమి స్ఫూర్తి లేకుండా క్షేత్రస్థాయి BJP కార్యకర్తలను అవమానిస్తున్నారని, విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.