గిద్దలూరు: ప్రజాల సమస్యలు పరిష్కరించడంలో జిల్లాలో మనమే నెంబర్ వన్: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జిల్లాలో మనమే మొదటి స్థానంలో ఉన్నామని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. అధికారుల సహాయ సహకారాలతో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా మరి కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని వాటిని కూడా అధికారులు త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టి పరిశీలిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ర్యాంకింగ్లో తమకు మొదటి స్థానం కలిగిలా పనిచేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.