దర్శి: దొనకొండ మండలం రుద్ర సముద్రంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ, తమ్ముడు మృతి
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామంలోని ఎస్సీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమ్ముడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.