తాడిపత్రి: కిష్టిపాడు గ్రామ సమీపంలోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు, 9 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్, నగదు స్వాధీనం
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సమీపంలోని పొలంలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న 9 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.21,330 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.