రాయదుర్గం: యూరియా వాడకాన్ని తగ్గించండి : బొమ్మనహాల్ ఏఓ సాయికుమార్
బొమ్మనహాల్ మండల వ్యవసాయాధికారి సాయి కుమార్ రైతులకు కీలక సూచనలు చేశారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, వ్యవసాయ అధికారుల సలహా మేరకు అవసరమైన పంటకు మాత్రమే సరైన మోతాదులో యూరియా వాడాలని కోరారు. శుక్రవారం నేమకల్లు రైతు సేవా కేంద్రంలో ఒక్కో బస్తా రూ. 280 రాయితీ ధరకు యూరియాను పంపిణీ చేశారు. యూరియా కొరత గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.