కొండపి: కొండపిలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపిలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు మంత్రి స్వీకరించారు. తర్వాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.