రాయదుర్గం: జనగణన పై బొమ్మనహాల్ మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వాహణ
సెన్సస్–2027 ఇళ్ల గణన సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ బొమ్మనహాల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఉద్దేహాళ్ ప్రభుత్వ పాఠశాల, బొమ్మనహల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్సే రైటింగ్ క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈవో ఈరన్న, తహసీల్దార్ మునివేలు, డిప్యూటీ తహసీల్దార్ రఘు, ఎస్ఓ కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.