గిద్దలూరు: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లుగా అర్చకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని చక్రస్నాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్రస్నాన అనంతరం స్వామి వారి విగ్రహాలను ఆలయానికి అర్చకులు చేర్చారు. ఈనెల రెండవ తేదీ నుంచి జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.