గిద్దలూరు: కంభం మండలం రావిపాడు గ్రామంలో ఘనంగా శ్రీ వేణుగోపాలస్వామి వార్షికోత్సవ కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తురతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.