కళ్యాణదుర్గం: సంచార జాతుల వారికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించాలి: తూముకుంటలో ఏపీ సంచార జాతుల సంఘం అధ్యక్షులు గంగారాం
సంచార జాతుల వారికి ప్రభుత్వాన్ని సదుపాయాలు, సంక్షేమ పథకాలు కల్పించాలని ఏపీ సంచార జాతుల సంఘం అధ్యక్షులు గంగారాం డిమాండ్ చేశారు. కుందుర్పి మండలం తూముకుంటలో సోమవారం ఆయన సంచార జాతుల సంఘం సభ్యులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంచార జాతుల వారు భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పథకాలు వర్తింప చేయడంతో పాటు విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.