మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కె కొత్తపల్లి గ్రామ సమీపంలోని చెరువు కట్ట రోడ్డు ప్రమాదకరంగా మారింది. తారు రోడ్డు ఒకవైపు చీలి కూలిపోయే పరిస్థితుల్లో ఉంది. గతంలో ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సుదర్శన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పరిశీలించి మరమ్మతులు చేపడతామన్నారు కానీ ఇంతవరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని స్థానికుల అన్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు