మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో 20వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని గురువారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గుండ్రెడ్డిపల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.