కనిగిరి: రాయవరం వద్ద బస్సు దగ్ధమై మృతి చెందిన వెలిగండ్ల మండలం చోడవరం గ్రామానికి మహేంద్ర మృతదేహం స్వగ్రామానికి చేరిక
వెలిగండ్ల: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటనలో మృతి చెందిన వెలిగండ్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర మృతదేహాన్ని డిఎన్ఏ పరీక్షల అనంతరం శనివారం అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మృతుడు మహేంద్ర పార్థివ దేహాన్ని దర్శించుకున్న గ్రామస్తులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుడు మహేంద్ర కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.