దర్శి: దర్శి పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వైసీపీ నాయకులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలను మోసం చేశారని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. అనంతరం కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టో చించి వేసి దహనం చేసి నిరసన తెలిపారు.