తాడిపత్రి: తాడిపత్రిని రాయలసీమ టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతాం: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిని రాయలసీమ టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని అందులో ఎవరు వేలుపెట్టిన ఊరకనే ఉండేది లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలోని తన స్వగృహంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన మాట్లాడారు. తాడిపత్రిలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అయితే సరిగా నిధులు రావడం లేదన్నారు.గుత్తి కోట ఉత్సవాలకు రూ.60 నుంచి 70 లక్షల దాకా ఖర్చు చేశారన్నారు. డబ్బంతా వృధా అయిందన్నారు. నేను గుత్తి కోట ఉత్సవాల్లో తాడిపత్రి టెంపుల్స్ కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. అది అందరినీ ఆకర్షించిందన్నారు. తాడిపత్రి అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడితే సమాధానమిస్తానన్నారు.