మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో ఎంపీపీ గుమ్మ పద్మజ నానమ్మ గంగమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.