రాయదుర్గం: పులకుంటలో 9 మంది బెట్టింగ్ రాయుళ్ళను అరెస్టు చేసిన పోలీసులు
గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో బెట్టింగ్ స్థావరంపై గుమ్మగట్ట పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారంతో ఎస్ఐ చిన్నరాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించారు. 9 మంది బెట్టింగ్ రాయుళ్ళను అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ తెలియజేశారు. వారి నుండి రూ. 51020 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.