కొండపి: మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టు పట్టడం తగదు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
మీ ప్రభుత్వ హాయంలో టీడీపీ కార్యకర్తలకు స్వేచ్ఛలేదని.. మేము ప్రజాస్వామ్య వాదులం కాబట్టి మిమ్మల్ని బయట స్వేచ్ఛగా తిరగనిస్తున్నామని మంత్రి స్వామి అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వకపోయినా.. ఆ హోదా కావాలని పట్టు పట్టడం తగదన్నారు. ఇటీవల జువ్వలదిన్నెలో జరిగిన జగన్ సభకు జనం రాక మర్రిపూడి మండలం నుంచి కూడా జనాన్ని తరలించారన్నారు. 64 గ్రామాల మత్స్యకారులు జగన్ సభను బాయ్ కాట్ చేశారన్నారు.