రాయదుర్గం: ఎట్టకేలకు అమృత్ - 2 పనుల ప్రారంభోత్సవానికి భూమిపూజ
రాయదుర్గం పట్టణంలో అమృత్ - 2 పథకం ద్వారా తాగునీటి పైపు లైన్ లు, ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, జెఎస్డబ్లూ ప్రతినిధులతో కలిసి రాయదుర్గంలో భూమిపూజ చేశారు. ఈ పథకంలో కనేకల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి 16.5 కిలోమీటర్ల మేర కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. పట్టణ సమీపంలోని నీటి శుద్ధి కేంద్రానికి నీటిని తరలించి అక్కడ శుద్ధికరించిన నీటిని ట్యాంకులకు పంపనున్నారు.