దర్శి: దర్శి వైసీపీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లా దర్శి వైయస్సార్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసిపి జిల్లా అధ్యక్షుడు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు.