మార్కాపురం జిల్లా దోర్నాల లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. దోర్నాల మీదుగా శ్రీశైలానికి గడ్డి లోడుతో వెళ్తున్న ఓ లారీకి మంటలు అంటుకొని అందులో ఉన్న గడ్డి దగ్ధం అయిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గడ్డి మొత్తం దగ్ధమైపోయిందని బాధితులు తెలిపారు.