రాయదుర్గం: మానసిక ప్రశాంతత కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాయదుర్గంలో పోలీస్ సిబ్బందికి 'హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో శనివారం ఈ ధ్యాన శిబిరం జరిగింది. ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించి విధి నిర్వహణలో సమర్థత పెంచడమ ప్రశాంతమైన మనసు.. దృఢమైన శక్తి.. మెరుగైన రేపటి కోసం' అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సిఐ జయనాయక్ తెలిపారు. ఎస్ఐ లు నబీరసూల్, గురుప్రసాద్ రెడ్డి, సురేష్, చిన్నరాయుడు పాల్గొన్నారు.