గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 2వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల రెండవ తేదీ గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బుధవారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలు తెలిపారు. మరమ్మతుల కారణంగా కొమరోలు మండలంలోని కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్, కాసినపల్లి విద్యుత్ సబ్ స్టేషన్, పరిధిలోని వివిధ గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.