రాయదుర్గం: డి.హిరేహాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని అనుమానాస్పద మృతదేహం
డి.హిరేహాల్ మండల పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని హిర్దేహాల్ నేమకల్లు గ్రామాల మద్య ఓ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో ఆహుతైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డి.హిరేహాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 35-40 సంవత్సరాల వయస్సు ఉంటుందని, అతని గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు హత్యకు గురయ్యాడా? తెలియాల్సి ఉంది.