రాయదుర్గం: పన్ను కట్టినా కొళాయికి నీరు రావడం లేదని ప్రశ్నించినందుకు వంద్దుడిపై TDP నేత దంపతుల దాడి, అవమాన భారంతో ఆత్మహత్యాయత్నం
పన్ను కడుతున్నప్పటికీ నీళ్లు ఎందుకు వదలడం లేదని ప్రశ్నించినందుకు ఓ టీడీపీ నేత దంపతులు 70 ఏళ్ల వృద్ధుడిపై చెప్పుతో కొట్టి దాడిచేసి అవమానపరచిన ఘటనతో అవమానం భరించలేక ఆ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాదితుడి కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన మోకా ఆంజినేయులు ఇంటికొళాయి నీటిపన్ను బకాయి పడడంతో గతనెలలో టీడీపీ నాయకుల ప్రమేయంతో అతడి పింఛన్ డబ్బు నుంచి పన్ను బకాయి రూ.2 వేలు మినహాయించుకుని మిగిలిన రూ.2 వేలు ఇచ్చారు.