రాయదుర్గం: పట్టణంలోని శాంతినగర్ లో వేడి నీళ్లలో పడి 9 నెలల శిశువు మృతి
వేడి నీళ్లలో పడి 9 నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ బైలాంజనేయ స్వామి గుడి ఏరియాలో 4 రోజుల క్రితం తల్లి నాగమ్మ తన బిడ్డ కు స్నానం చేయిస్తుండగా ప్రమాదవశాత్తు బిడ్డ వేడి నీటిలో పడిపోయాడు. మెదట రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కాన్పు కోసం వచ్చి బిడ్డను కోల్పోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు.