దర్శి: అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Apr 29, 2026 ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పీసీ పల్లి మండలం పిల్లి వారి పల్లిలో జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి కాశి నాయన స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కనిగిరి పార్టీ ఇన్చార్జి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.