గిద్దలూరు: కొమరోలు మండలంలో మే 29వ తేదీ విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మే 29వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని గురువారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా కసనపల్లె విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని చింతలపల్లి, కసినపల్లి గ్రామాలకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు ప్రజలని కోరారు.