గిద్దలూరు: కొమరోలు మండలం రెడ్డి చర్ల విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో మే 12 విద్యుత్ సరఫరాకు అంతరాయం: ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో రేపు అనగా మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెడ్డి చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా వ్యవసాయ మరియు గృహ సంబంధిత విద్యుత్ సరఫరా ఉండదని విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.