మార్కాపురం: ఒంగోలు నుండి మార్కాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు
ఒంగోలు నుండి మార్కాపురం వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి సమయంలో నగదును లెక్కిస్తూ డ్రైవర్ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తుండడంతో ఆ దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీశారు. ఈ విధంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరగరాని ప్రమాదం జరుగుతే ప్రయాణికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు భయాందోళనకు గురై వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.