తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి పాదాలు, శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
తాడిపత్రిలోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలు, శివలింగాన్ని తాగాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు యోగానంద శర్మ విశేష పూజలు చేశారు. బుధవారం రాత్రి సుమారు 11 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.