కొండపి: ప్రతి ఒక్క పౌరుడు స్వీయ గణనకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రతి ఒక్క పౌరుడు స్వీయ గణనకు సహకరించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు తమ కుటుంబ వివరాలను పోర్టల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. గురువారం తూర్పునాయుడుపాలెంలో తమ కుటుంబ వివరాలను పోర్టల్ లో పొందుపరచడం జరిగిందని మంత్రి తెలిపారు. 3000 మందికి పైగా సిబ్బంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.