కొండపి: సింగరాయకొండ టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న 6 కేజీల గంజాయిని స్వాధీనం, ఐదుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు
సింగరాయకొండ 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం వాహన తనిఖీలు చేపట్టింది. కారులో తరలిస్తున్న 6 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఐదు మంది వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్థానిక సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి ఎక్కడినుంచి ఎక్కడికి తరలిస్తున్నారో విచారణలో తెలియవలసి ఉందని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ హజరతయ్యా తెలిపారు.