మార్కాపురం: వేములకోట గ్రామంలో ఏరువాక పౌర్ణమి ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ఏరువాక పౌర్ణమిని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమినీ ఘనంగా ప్రారంభించామన్నారు.ఈ ప్రాంత రైతులకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు 63 వేల సెక్టార్లలో పండ్ల తోటల పెంపకానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు.