కొండపి: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన ఇంటి పన్ను చెల్లించిన మంత్రి స్వామి
మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి తన ఇంటి పన్ను చెల్లించి సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన స్వగృహానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మంత్రి ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి పన్ను మొత్తాన్ని అందజేసి రశీదు పొందారు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సాయ పడాలని కోరారు.