కళ్యాణదుర్గం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: కళ్యాణదుర్గంలో సీఐ యువరాజు
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు లాంటివని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కళ్యాణ దుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ యువరాజు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో శనివారం గ్రీన్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో చైతన్య పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ యువరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో కనీసం రెండు ముక్కలే నాటాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు చాలా ముఖ్యమైనవన్నారు.