దర్శి: మంచినీటి అవసరాల కోసం సాగర్ జలాలు విడుదల చేయడంతో జలకళ సంతరించుకున్న దర్శి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఓబీసీ కెనాల్ లో సాగర్ జలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాగడానికి అవసరాలకు ఈ సాగర్ జలాలను ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. మంచినీటి చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం తాగునీటి కోసమే ఈ సాగర్ జలాలను ప్రస్తుతం విడుదల చేశారు. దీంతో దర్శి ప్రాంతంలో సాగర్ జలాలతో ప్రధాన కాలువలు జలకలను సంతరించుకున్నాయి.