గిద్దలూరు: రాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ సమావేశం, స్థానిక సమస్యలపై చర్చించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
మార్కాపురం జిల్లా రాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్వసభ సమావేశం ఎంపీడీవో వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు చర్చించారు. ముఖ్యంగా నీటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు. అంతేకాకుండా వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా చేసి పారిశుద్ధ కార్మికులకు అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో తెలిపారు.