మార్కాపురం: భార్యాభర్తల మధ్య గొడవతో మనస్థాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించగా కాపాడిన పోలీసులు
మార్కాపురం పట్టణంలో నివాసముంటున్న శివయ్య భార్యాభర్తల మధ్య గొడవతో మనస్తాపం చెంది తను ఆత్మహత్య చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 112 కు కాల్ చేశారు. దీంతో రూరల్ పోలీసులు వెంటనే స్పందించి కందివారిపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఉండగా అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబానికి అప్పగించారు.