యర్రగొండపాలెం: దోర్నాల మండలంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్టు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడిలో నలుగురి అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామన్నారు.