గిద్దలూరు: గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో మే 13వ తేదీన పశువుల సంత జరుగుతుందని అధికారులు వెల్లడి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో మే 13 బుధవారం పశువుల సంత జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభిస్తారని నియోజకవర్గం లోని 6 మండలాలకు చెందిన రైతులు తమ పశువులను అమ్మడం లేదా పశువులను కొనడం వంటి కార్యక్రమాలు చేసుకోవచ్చని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.