మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు వద్ద ట్రాలీ ఆటో మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.